గాంధీజీ మునిమనుమడు ఎన్నిక

వాషింగ్టన్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి):
అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సాస్‌ స్టేట్‌ అసెంబ్లీకి భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమడు ఎన్నిక య్యారు. 72 ఏళ్ల శాంతిగాంధీ విజేతగా నిలిచారు. కార్డియో వాస్క్యులర్‌ సర్జన్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున శాంతిగాంధీ పోటీ చేశారు. డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన థియోడర్‌ ఎస్‌స్లేని ఓడించారు. గాంధీ మనుమడు కాంతిలాల్‌ గాంధీ తనయుడే శాంతిగాంధీ. ఆయన్ను అభినందనలతో ముంచెత్తారు.