గిరిజన భూముల కబ్జా ` మాజీమంత్రి మల్లారెడ్డిపై  కేసు


మేడ్చల్‌(జనంసాక్షి):  గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు నేపథ్యంలో శావిూర్‌పేట్‌  పోలీస్‌స్టేషన్‌లో మాజీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రి రిజిస్టేష్రన్‌ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎమ్మార్వోతో పాటు మల్లారెడ్డిపై ఫిర్యాదు రావడంతో నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్‌ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ నమోదు అయ్యింది.శావిూర్‌పేట్‌ పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్‌ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినావిూ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారని శావిూర్‌పేట పోలీస్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయ్యింది.విచారణ చేపట్టిన పోలీసులు మాజీ మంత్రి, అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్‌ రెడ్డి, కేశవాపూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త గోనె హరి మోహన్‌ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్‌)జిల్లా సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ శావిూర్‌పేట్‌ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్‌ రామిడి మధుకర్‌ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శావిూర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.