గీతా స్కూల్ లో ఘనంగా” జన్మాష్టమి వేడుకలు

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 19:: తూప్రాన్ గీత స్కూల్ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి
ఆద్యంతం ఆనంద భరితం …..
గోపికా కృష్ణులతో మురిసి పోయింది గీతా పాఠశాల ప్రాంగణం….
వందలాది చిన్నారులు రాధా కృష్ణుల వేషధారణలో అందంగా ముస్తాబై చిరునవ్వులు చిందిస్తూ ఆడుతూ పాడుతుంటే ” బృందావనమే” తరలివచ్చినట్లుగా ప్రాంగణమంతా కోలాహలంగా మారిపోయింది. చూడచక్కని ఆ వేషధారణలు చూపరులను కట్టిపడేశాయి.చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. తూప్రాన్ గీతా స్కూల్ లో ముందస్తు “శ్రీ కృష్ణ జన్మాష్టమి” వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.ఈ
సందర్భంగా పాత్ర పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ లోక కళ్యాణానికై ఉద్భవించిన శ్రీ కృష్ణ పరమాత్మ లోకానికి భగవద్గీతను అందించి మానవ జీవితాలను తరింపజేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్ పర్సన్ పి.ఉష, డైరెక్టర్ మరియు మున్సిపల్ చైర్మన్ బి.రాఘవేందర్ గౌడ్, డైరెక్టర్ మరియు మున్సిపల్ కౌన్సిలర్ కె.నారాయణ గుప్త ప్రిన్సిపాల్ సి.హెచ్. వెంకట కృష్ణారావు ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ప్రేంరాజ్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.