గీతికాశర్మ కేసులో అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

ఢిల్లీ : ఎయిర్‌హోస్టెన్‌ గీతికా శర్మ అత్మహత్య కేసులో అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ కందా, అరుణ్‌చద్ధాలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించింది.