గుండెపోటుతో ఆర్టీసీ అద్దెబస్సుల యజమాని హష్మత్ అలీ మృతి.

ఆర్టీసి కార్మికులు,సిబ్బంది నివాళి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై21 (జనంసాక్షి):
నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన ఆర్టీసీ అద్దె బస్సుల యజమాని మహమ్మద్ హష్మత్ అలీ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన రెండు దశాబ్దాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు పొందారు. సౌమ్యుడు,అందరితో కలివిడిగా ఉండే హష్మత్ అలీ మృతితో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సిబ్బంది దిగ్భ్రాంతికి లోనయ్యారు.ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, అద్దె బస్సుల నిర్వాహకులు స్థానిక ఆర్టీసీ డిపోతోపాటు ఆర్టీసీ బస్టాండ్ లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు.ఆయనకు భార్యతో పాటు నలుగురు సంతానం ఉన్నారు.
ముస్లిం సంఘాల సంతాపం:
హష్మత్ అలీ మృతిని పలువురు ముస్లిం సంఘాల సంతాపం ప్రకటించాయి. మంచి వ్యక్తిగా గుర్తింపు ఉన్న హష్మత్ అలీ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హష్మత్ అలీ మృతి తీరనిలోటని ఆరవ వార్డు కౌన్సిలర్ ఖాజా ఖాన్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.ఆయన అంత్యక్రియలు గురువారం రాత్రి స్థానిక ఖబ్రాస్తాన్ లో నిర్వహించారు.