గుడుంబా తరలిస్తున్న వ్యక్తి ని పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు

 జనంసాక్షి , రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు ఓసీపీ చెకపోస్ట్ వద్ద గుడుంబా రవాణా చేయుచు తాటి వనం వద్ద పన్నూరులో అమ్ముతున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు.. సోమవారం మంథని ఎక్సైజ్ సీఐ గురవయ్య ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు రూట్ వాచ్ చేపట్టారు. ఈ తనిఖీ లో రామగిరి మండలం పన్నూరు గ్రామానికి చెందిన గాజుల చంద్రశేఖర్ (39) అనే వ్యక్తిని పట్టుకొని గుడుంబాను రవాణా చేయుచున్న ఒక మోటార్ సైకిల్ సీజ్ చేసి (6) లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ గురువయ్య తెలిపారు. సదర్ వ్యక్తిపై ఫై చట్ట రీత్యా కేసు నమోదు చేసినట్లు సిఐ ఈ సందర్భంగా తెలిపారు. మంథని ఎక్సైజ్ సీఐ గురవయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది శ్రీనివాస్, సంపత్, హరీష్, రవి లు పాల్గొన్నారు. గుడుంబా రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న మంథని ఎక్సైజ్ సిఐతో పాటు సిబ్బందిని పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.