*గురుకులంలో ఆకలితో ఆందోళన*

జనం సాక్షి జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని పోచమ్మ గడ్డ తండాలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల(బాలానగర్)లో చదువుతున్న విద్యార్థులు సమయానికి టిఫిన్ ,భోజనం అందక గత 2 రోజులుగా ఆకలితో అలమటించిపోతున్నారు.వంట వాళ్ళు లేక అవస్థలు,  గత 2రోజులుగా వంట వాళ్ళ అవతారం ఎత్తిన టీచర్లు,  అటెండర్లు. ఉదయం. 10 గంటలకు బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం 3 గంటలకు భోజనం.
ఉడికి ఉడకని అన్నం తినలేక అవస్థలు పడిన విద్యార్థులు. ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు భయానికి సమస్యను  చెప్పుకోవటానికి భయపడుతున్న సిబ్బంది. ఈ సమస్యకు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేపట్టకపోవడం తో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు పాఠశాలలను పర్యవేక్షించి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది