గురుకుల పాఠశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

మక్తల్ అక్టోబర్ 14 (జనంసాక్షి) పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో నూతనంగా మంజూరైన మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ విద్య కోసం ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా గురుకులాలు మంజూరు చేసి విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే విధంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావని మల్లికార్జున్, ఎంపీపీ వనజ, సిఐ సీతయ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.