గుర్తింపు దిశన ఏఐటీయూసీ?    

హైదరాబాద్‌(జనంసాక్షి):సింగరేణి యూనియన్‌ గుర్తింపు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికి యూనియన్‌ గుర్తుంపు కు అవసరమైన ఓట్ల లీడ్‌  దిశన ఏఐటీయూసీ కొనసాగుతున్నది.బెల్లంపల్లి, మందమర్రి, రామగుండం ఒకటి, రామగుండం రెండు, శ్రీరాంపూర్‌ ఏరియా లలో ఏఐటీయూసీ, కొత్తగూడెం, కొత్తగూడెం కార్పొరేట్‌, భూపాలపల్లి, ఇల్లందు, మణుగూరు లలో, అర్జీ మూడు లో ఐఎన్టియుసి విజయం దిశన ఉన్నాయి. మూడు వేల దాక ఓవర్‌ ఆల్‌ గా ఏఐటీయూసీ లీడ్‌ లో ఉందని, ఆ యూనియన్‌ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు.