గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి.

కౌడిపల్లి(జనంసాక్షి). మండల పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన రామావత్ కైలాష్ (30) బతుకుదెరువు కోసం ఐదు సంవత్సరాలుగా దుండిగల్ వద్ద బైక్ మెకానిక్ గా పని చేసుకుంటూ అక్కడే స్థిర నివాసం ఉంటున్నాడు.శనివారం రోజున కొత్తచెరువు తండాకు వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని నేషనల్ హైవే పై మరణించిన సంఘటన  చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రమావత్ కైలాష్ తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో దుండిగల్ వద్ద మెకానిక్గా పని చేసుకుంటూ బతుకుతున్నాడు. శనివారం రోజున తన బాబాయ్ కు ఫోన్ చేసి ఇంటికి వస్తున్నానని తెలిపాడు. రాత్రి సమయంలో తాండకు చెందిన వ్యక్తి కైలాష్ కు యాక్సిడెంట్ జరిగి చనిపోయి ఉన్నాడని తెలపడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకునేసరికి నిజంగానే చనిపోయి ఉన్నాడు అని,తన అన్న కుమారుడైన కైలాష్ ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలభాగం పగిలిపోయిందని, ఆయన మరణానికి కారణమైన వ్యక్తులను గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రమావత్ కిషన్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై తెలిపారు.