గుర్రాల కుంట గండిని పూడ్చివేసిన అధికారులు.
కౌడిపల్లి (జనంసాక్షి ).మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజిపేట గ్రామానికి అతి సమీపంలో ఉన్న గుర్రాలకుంటకు గండిపడడంతో స్పందించిన మండల తాహసిల్దార్ కృష్ణయ్య హుటాహుటిన గుర్రాలకుంటకు పడిన గండిని పూడ్చి వేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లింగం గౌడ్, ఉప సర్పంచ్ మాధవి శివ కార్యదర్శి నరహరి గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
