గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా అన్నదాతల ఆత్మీయ సంబరాలు ఆదివారం ఐదో రోజు సీనియర్ విభాగం బండలాగుడు పోటీలు నిర్వహించారు.ఈ పోటీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కేరింతల మధ్య రసవతరంగా కొనసాగాయి. మొత్తం 8 జతలఎద్దులు పాల్గొన్నాయి.ఈ పోటీలలో గెలుపొందిన సుంకి సురేందర్ రెడ్డి హుజూర్నగర్ సూర్యాపేట జిల్లా ఎద్దులు 3600 ఫీట్లులాగా మొదటి బహుమతి 70000 వేలు గెల్చుకున్నాయి.డివిఆర్ మెమోరియల్  దేవ భక్తిని  సుబ్బారావు కానూరు  కృష్ణాజిల్లా 3o69.03 ఎద్దులు ఫీట్లు లాగి అరవై వేలు రెండో బహుమతి సాధించాయి.పులి చిన్న ఓబుల్ రెడ్డి ముడ్డు రాళ్లపల్లి నంద్యాల జిల్లా 3501.10ఫీట్లు లాగి 50 వేలు మూడో బహుమతి గెలుచుకున్నాయి.శీలం జగన్మోహన్ రెడ్డి ఆనంవారిపల్లి కడప జిల్లాచెందిన ఎద్దులు 2792.05 ఫీట్ లాగి నాలుగు బహుమతిని 40 వేలు గెలుచుకున్నాయి.డాక్టర్ గుర్నాథ్ కొత్తకోట నంద్యాల జిల్లా ఎద్దులు 2787.04 ఫీట్లు లాగి 5 బహుమతిని 30000 గెలుచుకున్నాయి.బి ఎస్ ఎస్ రెడ్డి ఎస్ కొత్తూరు నంద్యాల జిల్లా 2539.08 ఎద్దులు ఫీట్లు లాగి ఆరో బహుమతి 20000 రూపాయలు గెలుచుకున్నాయి.రవీందర్ రెడ్డి మనపాడు గద్వాల జిల్లా 2107 ఎద్దులు ఫీట్లు లాగి ఏడవ బహుమతి 10000 గెలుచుకున్నాయి.భాస్కర్ గౌడ్ దేవ్ బండ తెలంగాణ జిల్లా 2251 ఫీట్స్ లాగి 8వ బహుమతి 5000 రూపాయలు గెలుచుకున్నాయి. బహుమతులకు సహకరించిన దాత గద్వాల ఎమ్మెల్యే బండ జ్యోతి కృష్ణమోహన్ రెడ్డి సహకరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ జంబురామన్ గౌడ్ ,ఎంపీపీలు వై రాజారెడ్డి ,విజయ్,జెడ్పిటిసి రాజశేఖర్,సింగల్ విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి,వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న, సర్పంచ్ యాకోబు,ఆలయ చైర్మన్ ప్రహ్లాద రావు,మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న ,ఎంపీటీసీ జయమ్మ నర్సింలు, సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,మాజీ సర్పంచ్ నరేందర్ ,టిఆర్ఎస్ నాయకులుమధు, రామచంద్రారెడ్డి,పరశురాముడు,నాగరాజు, సవరన్న,భాస్కర్ గౌడ్,తూమ్ కృష్ణారెడ్డి ,పురుషోత్తం రెడ్డి, నారాయణ,అమృత్ కుమార్ వార్డు సభ్యులుతదితరులు పాల్గొన్నారు.