గెల్లుపై ఈటెల రాజేందర్‌ విమర్శలు అర్థరహితం

మండిపడ్డ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌
హైదరాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటల రాజేందర్‌పై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నిప్పులు చెరిగారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈటలపై తలసాని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలోని విూడియా పాయింట్‌ వద్ద మంత్రి తలసాని మాట్లాడుతూ.. గెల్లు శ్రీనివాస్‌ను బానిస అనడం భావ్యం కాదన్నారు. ఈ వ్యాఖ్యలు ఈటల అహంకారానికి నిదర్శనం అని పేర్కొన్నారు. ఈటల ముందు గెల్లు చిన్న పిల్లవాడు కావచ్చు.. నాడు ఈటల కూడా దామోదర్‌ రెడ్డి ముందు చిన్నవాడే అన్న విషయాన్ని మరిచి
పోవద్దు అని తలసాని సూచించారు. ఉద్యమకారులకు టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గతంలో విద్యార్థి నాయకులైన బాల్క సుమన్‌, గ్యాదరి కిశోర్‌ లాంటి వారికి అవకాశం కల్పించి, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. గెల్లు శ్రీనివాస్‌కు కూడా అదే విధంగా కేసీఆర్‌ ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టం చేశారు. గతంలో ఆరు సార్లు కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలపైన ఈటల విజయం సాధించారు.. జానారెడ్డికి పట్టిన గతే ఈ ఉప ఎన్నికల్లో ఈటలకు పడుతుంది అని అన్నారు. ఈటల హుజూరాబాద్‌కు వెళ్తే బీసీ.. శావిూర్‌పేటకు ఓసీ అయిపోతారని విమర్శించారు. హుజూరాబాద్‌ ప్రజలు ఈటల రాజేందర్‌కు తప్పకుండా గుణపాఠం చెబుతారు అని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.