గోల్కొండ కోటలో స్వాతంత్య్ర వేడుకలు

15న సిఎం కెసిఆర్‌ పతాకావిష్కరణ
ఏర్పాట్లను సవిూక్షించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌
హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జనంసాక్షి): ఈఏడాది కూడా స్వాతంత్యద్రినోత్సవాన్ని గోల్కొండ కోటలోనే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వ తేది ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ బీఆర్కే భవన్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి స్వాతంత్యద్రినోత్సవం కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై సవిూక్షించారు.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. బందోబస్తు
ఏర్పాట్లను సమర్ధవంతంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సామాన్య ప్రజానికానికి ఎటువంటి ఆటంకం కలుగకుండా ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.. గోల్కొండ కోటలో అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను కోరారు. కోవిడ్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, మాస్క్‌ లు, శానిటైజర్‌ లను సరిపడ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రతిభింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడానికి కళాబృందాలను సవిూకరించాలని సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంద్రాగట్టు వేడులకను ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.