గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్..

-జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య…
 అచ్చేదిన్ తెస్తాం అంటూ సచ్చేదిన్ తెచ్చి..గ్యాస్ సిలిండర్ ధర మరోసారి 50 రూపాయలు పెంచిన ప్రధాని మోదీ…
-గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి..
సాలు మోదీ… సంపకు మోదీ…బై బై మోదీ….
-మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్….
 గద్వాల రూరల్ జులై 08 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండు వద్ద కేంద్ర బిజెపి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ల‌ ధరలు పెంపునకు నిరసనగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద *గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి* అధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం నిర్వహించారు…గ్యాస్ సిలిండర్ ధరలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన లో భాగంగా పట్టణంలోని మహిళలతో కలిసి గ్యాస్ సిలిండర్ తో బతుకమ్మ ఆడారు….ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుతో సామాన్యుడి బతుకు ఆగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ అని అన్నారు… ప్రధాని మోదీ అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాల కారణంగా దేశంలోని ఇళ్లలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ ఆరోపించారు.. గడియకో సారి పెరుగుతున్న గ్యాస్ ధరతో దేశ ప్రజలకు గుండె దడ వస్తోందన్నారు…గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రజల రక్తాన్ని పెరుగుతున్న ధరల పేరుతో పీల్చి పిప్పి చేస్తోందని, పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్ర ప్రభుత్వం తగ్గించే వరకు ఉద్యమం చేస్తామని ఎమ్మెల్యే అన్నారు.. మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అసమర్థత ఆర్థిక విధానాలు ధరల పెంపుపైన టిఆర్ఎస్ పార్టీ నిరంతరం వివిధ రూపాలలో నిర్వహిస్తామన్నారు…ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్.బురెడ్డిపల్లి సర్పంచ్ బండ్ల జ్యోతి,ఆయా మండలాల జెడ్పిటిసిలు పద్మ వెంకటేశ్వర రెడ్డి, రాజశేఖర్,ప్రభాకర్ రెడ్డి, ఎంపిపిలు విజయ్,రాజారెడ్డి,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రాములు,మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ,వైస్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి,జమ్మిచేడు ఆలయ చైర్మన్ సతీష్, పట్టణ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు..