గ్రంథాలయ భవనానికి 50 లక్షలు

నిధులు మంజూరు మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు
శివ్వంపేట జూలై 21 జనంసాక్షి :
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా గ్రంధాలయ భవనానికి నిధులు మంజూరు చేయించిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును గురువారం జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ దొంతి చంద్రాగౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, జిల్లా సీనియర్ నాయకులు గొర్రె వెంకట్ రెడ్డి, తదితరులు హైదరాబాద్ లో మంత్రి నీ కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ చంద్రాగౌడ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన మెదక్ లో ఇప్పుడున్న గ్రంధాలయ భవనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నరన్నా విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన స్పందించి నూతన భవన నిర్మాణం కోసం 50 లక్షల రూపాయలను మంజూరు చేశరన్నారు.  ప్రభుత్వ నిధులతో అధునాతన హంగులతో నూతన గ్రంధాలయ భవనాన్ని త్వరితగతిన  నిర్మించి పాఠకులకు  అందిస్తామన్నారు . అడుగాగనే 50 లక్షల రూపాయలను మంజూరు చేసిన సీఎం కేసిఆర్ కు, నిధుల మంజూరుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డికి జిల్లా ప్రజల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు.
Attachments area