గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైన ఇస్తాం

             * ఢిల్లీ పేర్నాడు రికార్డ్ ఇండియా టీం ప్రతినిధులు తూప్రాన్( జనం సాక్షి )జూన్ 21 :: గ్రామాల అభివృద్ధికి బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో తమ సంస్థ ద్వారా చేస్తున్న గ్రామాల అభివృద్ధి పథకం సత్ఫలితాలు ఇస్తుందని అందుకు ఎన్ని నిధులైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీకి చెందిన పే ర్నాడు రికార్డు ఇండియా సంస్థ ప్రతినిధులు శశిధర్ అంజలి లతిక గరిమ నూతనక సర్కార్ లు పేర్కొన్నారు మనోహరాబాద్ మండలం జిల్లా పరిషత్ చైర్మన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్ దత్తత గ్రామం గౌతోజిగూడ లో బాలవికస స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంల పే ర్నాడు రికార్డ్ ఇండియా టిమ్ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామంలో సభ నిర్వహించారు జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చెరువు పూడిక,మట్టిని తీయడం రైతులకు ఎంతో మేలు జరిగింద నీ కుడిక మట్టిని తమ పంట పొలాలలో వేసుకొని పంటలు పండించడం ద్వారా రసాయనక ఎరువుల చాలా తగ్గుతాయని నాణ్యమైన పంట దిగుబడి వస్తుందని అన్నారు దీనిని గుర్తించి తాము అనేక గ్రామాలలో పూడికం మట్టి పనుల ను చేపట్టామని తెలిపారు  అలాగే పంపాండ్స్ (చేపల చెరువు) బోర్వెల్ రీసెర్చ్ చెరువు కట్ట వెడల్పుగా చేసి మొరంతో కట్ట ని బలంగా చేశార నీ అన్నారు జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రేణు కుమార్ మాట్లాడుతూ మా గ్రామ నికి రైతులకు చేసిన మేలు బాలవికస సంస్థ కి ఢిల్లీకి చెందిన స్వచ్ఛంద సంస్థ పి ఆర్ ఐ కి గ్రామ ప్రజల తరుపున రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు వారి ఆధ్వర్యంలో 5600 పైగా ట్రాక్టర్ల పూడిక మట్టిని రైతులకు గ్రామ అవసరాలకు ఉపయోగించామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు  ఈ డి శౌర్య రెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో ఏ పని చేసిన కలసికట్టుగా చేయించుకుని గ్రామస్తులు అందరూ ఒక్క యూనిట్ గా ఉన్నారు మీ గ్రామా అభివృద్ధి కి బాల వికాస తరుపున మేము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పి ఆర్ ఐ ఢిల్లీ టీమ్.శశిధర్, అంజలి.లతిక. గరిమ.సూతనుక సర్కర్. బాల వికాస పోగ్రామ్ మేనేజర్ తిరుపతి. పోగ్రామ్ కో ఆడినేటర్ మూర్తి. బాలవికస టీమ్ వార్డు సభ్యులు పెంటమ్మా.భవాని శ్రీనివాస్ పద్మ అంజనేయులు. నాయకులు రైతులు.మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు