గ్రామాల అభివృద్ధికి కృషి

శివ్వంపేట జూలై   జనంసాక్షి :గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధి తో కృషి చేస్తానని  ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు.  మండల పరిధి లోని మగ్దుంపూర్  గ్రామoలో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికీ గురువారం ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో  కలిసి భూమిపూజ చేశారు. ఈ  సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో ఎన్నో అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో
సర్పంచ్ సోము అశోక్, ఉప సర్పంచ్ నజీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, వార్డ్  మెంబర్స్,  గ్రామస్తులు  పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Attachments area