గ్రామ కమిటీ ఎన్నిక

వరంగల్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): ఖానాపురం తెదేపా గ్రామ కమిటీని శనివారం ఎంపిక చేసినట్లు ఎన్నికల నిర్వహణ అధికారి టి.స్వామి తెలిపారు. అధ్యక్షుడిగా చూడి ప్రతాపరెడ్డి, ఉపాధ్యక్షులుగా ఏకాంబరం, ఎల్లమ్మ, ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటనాగసురేష్‌, ప్రచార కార్యదర్శిగా తరాల శ్రీనివాస్‌, వీరితో పాటు 13 మంది కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు.