గ్రామ నిధుల సమాచారం ఇవ్వండి

ఇబ్రహీంపట్నం ,ఆగస్ట్ 30, (జనం సాక్షి ) జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మండలంలోని వేములకుర్తి గ్రామంలో మంగళ వారం నాడు బీజేపీ నాయకులు సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం వేములకుర్తి గ్రామానికి వచ్చిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వల నుండి వచ్చిన నిధుల సమాచారం కోసం దరఖాస్తు కోరుతూ పంచాయతీ కార్యదర్శి కి ఇవ్వడం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమాచారాన్ని వీలైనంత తొందరగా లేదా 30 రోజుల్లో సంబందిత సెక్షన్ ప్రకారం సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సుంచు రణదీర్, కార్యదర్శులు బెజ్జరపు శ్రీనివాస్, కేటగిరి వెంకటస్వామి, ఓ బి సి మోర్ఛా మండల అధ్యక్షుడు మలేపు శ్రీనివాస్, ఉప అధ్యక్షులు చాట్ల రమేష్, ఏడిపల్లి రాజారెడ్డి, కారం భూమన్న రాజేష్ తదితరులు పాల్గొన్నారు.