గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి

పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్
దోమ నవంబర్ 19(జనం సాక్షి)
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని పాలేపల్లి సర్పంచ్ యశోద తిరుపతి సాగర్ అన్నారు.శనివారం పాలేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీలో వివిధ రకాల పనుల యాక్షన్ ప్లాన్ కోసం తీర్మానాలు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని,రాజకీయ పార్టీలకు అతీతంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అనంతరం ప్రపంచ స్వచ్ఛత దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు గ్రామ ప్రజలు,అధికారులు ప్రతిజ్ఞ చేశారు.సర్పంచ్ గ్రామస్థులతో కలిసి ప్రతి కుటుంబ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని గ్రామ వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.ఈకార్యక్రమంలోటెక్నికల్ అసిస్టెంట్ నారాయణరెడ్డి,ఉప సర్పంచ్ రమేష్,ఎంపీటీసీ విజయ గోపాల్ గౌడ్,పంచాయతీ కార్యదర్శి సంతోషి, ఫీల్డ్ అసిస్టెంట్ జయమ్మ,కరోబార్ అంజిలయ్య, వార్డ్ మెంబర్ గంగపురి,నాయకులు తిరుపతి సాగర్,అజయ్ కుమార్ రెడ్డి,శ్రీశైలం తదితరుల గ్రామ ప్రజలు పాల్గొన్నారు.