*ఘనంగా అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు*

మక్తల్ జనంసాక్షి (అక్టోబర్ 15) మక్తల్ పట్టణంలోని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నివాసంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, భారతరత్న డాక్టర్ .ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అబ్దుల్ కలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్ మాట్లాడుతూ రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ లో కలామ్ సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంలింగం, బిల్డర్ తాయప్ప, విష్ణు వర్ధన్ రెడ్డి, శాలం, అన్వర్, శంసుద్దీన్, ఈశ్వర్ యాదవ్, బండారు ఆనంద్, కర్రెమ్ కృష్ణ, చెన్నయ్య గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.