ఘనంగా అయ్యప్ప పడిపూజ”కాశీపతి” గురుస్వామిని సన్మానించిన వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

గోపాల్పేట్  మండల కేంద్రంలో కాశీపతి గురుస్వామి 18 వ పడి, 18వ శబరిమల యాత్ర సందర్భంగా మహాపడి పూజ నిర్వహించారు. వనపర్తి ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది. వందలాదిమంది అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్న ఈ పూజలో గణపతి హోమం, గోపూజ, అయ్యప్ప అభిషేకం అష్టోత్తరం పడిపూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. 18 సార్లు మాల వేసుకుని శబరి యాత్ర చేయడం చాలా పుణ్యకార్యమని ఈ సందర్భంగా ముత్తు కృష్ణ గురుస్వామి శిష్య బృందం వైస్ చైర్మన్ కాశీపతి గురుస్వామిని ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు కాగితాల లక్ష్మీనారాయణ, వెంకన్న, కటకం చంద్రుడు, నందిమల్ల అశోక్, పోతుల రాము, చెన్నయ్య కె.వి.ఆర్ మధు సురేష్ అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు