ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

భారతదేశంలోని పేదరిక నిర్మూలన కోసం మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎనలేని కృషి చేశారని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ వాదులు అంత ఏకధాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, సి ఎల్ యాదగిరి, టిఎస్ సంజీవ్ కుమార్, సూర్య ప్రకాశ్ రెడ్డి, పవన్, సత్యనారాయణ, సంతోష్ రెడ్డి, వీనస్ మేరీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.