ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతి వేడుకలు

మక్తల్ జూలై 08 (జనంసాక్షి) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి 73 వ జయంతి పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంలో వారు చేసిన సేవలను స్మరించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, ప్రజల మన్నలను పొందిన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు 2004 సంవత్సరంలో పాదయాత్ర చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డిది సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు ఉచిత కరెంటు రైతులకు ఏకకాలంలో రుణాలను మాఫీ చేశారు రాష్ట్రంలోనే కాక కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం కు ఏర్పాటుకు కారకుడు, నేడు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం కానీ ఆయన ఆశయాల కొరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సైనికుడిలా పని చేసి రాబోవు రోజుల్లో అధికారమే లక్ష్యంగా నాయకులు పని చేయాలని సందర్భంలో పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బి .నర్సింలు, మండల అధ్యక్షుడు
బి గణేష్ కుమార్, పట్టణ అధ్యక్షుడు) ఏ .రవికుమార్ బిసి మండల అధ్యక్షుడు కట్ట వెంకటేష్, గొల్లపల్లి నారాయణ పెద్దింటి మల్లేష్, బోయ వెంకటేష్, M.శ్రీనివాసులు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు జి రవికుమార్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కల్లూరి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు
Attachments area