ఘనంగా ఐలమ్మ వర్ధంతి వేడుకలు

మక్తల్ సెప్టెంబర్ 10 (జనంసాక్షి) మఖ్తల్ పట్టణంలోని పాత బజార్ గాంధీ చౌక్ వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తిమ్మన్నోళ్ల నర్సింలు, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి మూర్తి , మండల అధ్యక్షులు హనుమంతు, సభ్యులు అమ్రేష్ ,జె‌.నర్సింలు, బాలప్ప , పి.నరసింహులు, శీను , తాయప్ప , పి.రాజు, నగేష్ , అంజి , లక్ష్మణ్, టి. రాజు తదితరులు పాల్గొన్నారు.