ఘనంగా కామ్రేడ్ రామనాధం జయంతి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): పట్టణ సిపిఐ పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సర్వదేవబట్ల రామనాధం 30 వ వర్ధంతిని సిపిఐ, ఏఐటీయూసీ శ్రేణులు ఉరువారం ఘనంగా నిర్వహించారు. ఆర్కేపీ బ్రాంచి కార్యదర్శి యం. డి అక్బర్ అలీ అధ్యకతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సర్వదేవబట్ల రామనాధం ఉన్నత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్యను అభ్యశించి ఆనాటి అణచివేతలకు వ్యతిరేకంగా, కమ్యూనిస్ట్ పార్టీలో చేరి, పేదల హక్కులకై ఎన్నో పోరాటాలు చేసి, తనకున్న 1800 ఎకరాల భూమిని కూడా పేదలకు పంచారని కొనియాడారు. అదే విధంగా ఆయన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ మొదటి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడి, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసారని, అజంజాహి మిల్లు లో పని చేసి, అక్కడి కార్మిక సమస్యలను కూడా పరిష్కరించడం జరిగిందన్నారు. అప్పటి నిజాము ప్రభుత్వంకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపించి, 1932 నుండి 1959 వరకు జైలు జీవితం గడిపినారని, వీరు తెలంగాణ లో తొలి తరం కమ్యూనిస్ట్ గా రామనాధం దేవులపల్లి వెంకటేశ్వర్ రావు, రావి నారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి లాంటి వాళ్లకు కమ్యూనిస్ట్ సభ్యత్వం ఇచ్చిన నాయకుడిగా వర్ణించారు. అలాంటి నాయకుడి స్పూర్తితో సింగరేణి లో కార్మికులంతా సంఘటీతం అయ్యి మన హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని,ప్రస్తుతం సింగరేణి లో ఉన్న గుర్తింపు సంఘం చేతకానితనం వలన అన్ని హక్కులు పోతున్నాయని, కాబట్టి నేటి వరకు కూడా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు కాలేదని, అలవెన్స్ ల పైన ఇన్కమ్ టాక్స్ రాయితీ రాలేదని చెప్పారు. ఉన్న గనులను ప్రైవేటుపరం చేస్తున్నారని, ప్రతి సంవత్సరం లాభాల బాటలో అన్యాయం చేస్తున్నారని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని, వీటన్నింటినీ సాధించడంతోపాటు, ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేస్తున్న కార్మిక హక్కులను కాపాడడం కోసం సింగరేణి వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 వరకు జరిగే పోరాటాలను విజయవంతం చేయడం ద్వారా రామనాథం గ ఆశయాలకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. వీరి స్ఫూర్తితోనే సెప్టెంబర్ 4న జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, రామకృష్ణాపూర్ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, ఫిట్ కార్యదర్శులు ఆర్ కే ఓ సి పి ఫిట్ సెక్రెటరీ ఆర్ణ కొండ ఆంజనేయులు, ఆర్ కే పి సి హెచ్ పి ఫిట్ కార్యదర్శి ఏ సంజీవ్, ఏరియా హాస్పిటల్ పిట్ కార్యదర్శి భత్తుల రాజు కుమార్, 1ఏ ఫిట్ సహాయ కార్యదర్శి గోవిందుల రమేష్,, సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి వనం సత్యనారాయణ,, ఏఐటీయూసీ కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు బోయ పోతుల కొమురయ్య, కాదండి సాంబయ్య, సిలివేరు హరీష్,ఎగుడ మొండి, పోగుల రమేష్, జంగపల్లి సత్తయ్య, కుక్క దేవానంద్, నల్ల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు