ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుకలు

నిర్మల్ బ్యూరో ,ఆగస్టు07,జనంసాక్షి :  భారత స్వాతంత్రోద్య మంలో ప్రధాన భూమిక పోషించి స్వతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది ‘చేనేత’ అని జిల్లాపరిషత్ చైర్పర్సన్ కొరిపెళ్లి విజయలక్ష్మి రాంకిషన్ రెడ్డి అన్నారు, ఆదివారంనిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనoలో అధికారికంగా రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పద్మశాలి నుద్దేశించి  ఆమె మాట్లాడుతూ    గాంధీజీ సైతం రాట్నంపై నూలు వడకేందుకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారని, అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి ప్రత్యేకంగా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏర్పాటు చేశారన్నారు. 2017 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోది మొదటి చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారని, ఈ సందర్భంగా జాతీయ భారత చేనేత లోగోను ఆవిష్కరించి,ఆగస్టు ఏడవ తేదీని జాతీయ చేనేత దినోత్సవం గా ప్రకటించిన నిర్వహిస్తూ రావడం జరిగిందన్నారు  .అనంతరం చేనేత ప్రతిజ్ఞను చేసి, అంబేద్కర్ భవనం నుండి ర్యాలీని నిర్వహించారు. అలాగే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్  హేమంత్ బొర్కడే మున్సిపల్ చైర్మన్ జి.ఈశ్వర్, సెక్టోరియల్ అధికారి శ్రీదేవి,పరీక్షల విభాగం అధికారి పద్మ ,పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్ద రమణ ,జిల్లా అధ్యక్షులు చిలుక రమణ,కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్, రేగుంట రాజేశ్వర్ ,అల్లం అశోక్ ,రమేష్,పవన్,నరహరి,,పట్టణంలోని పద్మశాలి పాంథల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, విద్యార్థులు పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు.