ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

సోమవారం శామీర్ పేట లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ మహాత్మా జ్యోతిరావు పూలే 132 వ వర్ధంతి సందర్భంగా పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన తో పాటు సతీమణి సావిత్రి బాయి పూలే జీవితాలు ప్రతి ఒక్కరి కి ఆదర్శప్రాయమని అన్నారు. విద్యా వ్యాప్తికి వీరు చేసిన కృషి చిరస్మరణీయ మని అన్నారు. వీరు చేసే సామాజిక సేవ కు అగ్రవర్ణాల నుండి ఎన్ని అవరోదాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొని ముందుకు సాగారని, ఆరకంగా వీరు బడుగు బల హీన వర్గాల కు చేసిన సేవలు చిరస్థాయి గా నిలిచిపోతాయని అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు తెలిపారు. ఈ కార్యక్రమం లో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి, షేక్ చాంద్ పాషా, కేసిఆర్ సేవాదళం మండల అధ్యక్షులు మహ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, చందర్, షాఘంటి మహేష్ ముదిరాజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
28ఎస్పీటీ -2: నివాళులు అర్పిస్తున్న నాయకులు