ఘనంగా ధ్వజస్తంభ ఊరేగింపు
ఫోటో: ధ్వజస్తంభానికి పూజలు చేస్తున్న గ్రామ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, మల్లెపల్లి కరుణాకర్
పెన్ పహడ్. ఆగస్టు 8 (జనం సాక్షి) ; మండల పరిధిలోని దూపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజ స్తంభ ప్రతిష్టకు నూతనంగా ప్రతిష్ట స్థాపనకు తెస్తున్న ధ్వజ స్తంబాన్ని గ్రామ పొలిమేర వద్ద ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున ధ్వజ స్తంభం వద్దకు చేరుకున్నారు కోలాట నడుమ భజన్త్రీల తో ఊరేగింపుతో కోలాటాలతో చప్పట్లతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు మాజీ పిఎసిఎస్ చైర్మన్ మల్లెపల్లి కరుణాకర్ మాజీ సర్పంచ్ గుగ్గిళ్ళ సోమయ్య గ్రామ శాఖ అధ్యక్షులు జడ వీరయ్య నిర్వాకులు పిన్నని జనార్దన్ అర్తికేశవులు చెరుకుపల్లి నాగేశ్వరరావు నిమ్మల రాజు గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు
