ఘనంగా పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం

సిరివెన్నెల తదితరులు అవార్డుల స్వీకరణ
న్యూఢిల్లీ,మార్చి11(జ‌నంసాక్షి): రాష్ట్రపతి భవన్‌ లో పద్మశ్రీ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిద రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పలువురికి పురస్కారాలను ప్రెసిడెంట్‌ రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రధానం చేశారు. సినీ రంగం నుంచి ప్రభుదేవా, శంకర్‌ మహదేవన్‌, మోహన్‌ లాల్‌, శివమణి, సిరివెన్నెల సీతారామశాస్త్రీ రాష్ట్రపతి చేతుల విూదుగా పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. క్రీడల నుంచి క్రికెటర్‌ గౌతం గంభీర్‌, ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ, చదరంగం క్రీడాకారిణి హారికా ద్రోణవల్లి పురస్కారాలు స్వీకరించారు. వ్యవసాయవేత్త వెంకటేశ్వర రావు యడ్లపల్లికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఇక విదేశాల నుంచి ఏడుగురు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.