ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి13వ వర్ధంతి. 

– మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన డాక్టర్ వైయస్సార్ వర్ధంతి.

బూర్గంపహాడ్ సెప్టెంబర్ 02 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక గ్రామం ప్రధాన కూడలి లో కాంగ్రెస్ పార్టీ సారపాక టౌన్ అధ్యక్షులు ఎల్లంకి రామకృష్ణ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తీరని లోటు అని ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు నేటికీ ఉపయోగ పడుతున్నాయని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొని రావడానికి కృషి చేశారని అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని నివాళులర్పించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క బాధ్యతగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, ఐ టి సి పి ఎస్ పి డి ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యారం పిచ్చి రెడ్డి, మండల నాయకులు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, చల్లా వెంకటనారాయణ, బెల్లం కొండ వాసుదేవరావు, పూలపెళ్లి సుధాకర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కనితి కృష్ణ, రేణుక, కళ్యాణి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

బూర్గంపహాడ్ మండల కేంద్రం లో

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతిని కార్యక్రమం నిర్వహించారు. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, తోట దేవి ప్రసన్న అదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బి బ్లాక్ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, మండల ప్రధాన కార్యదర్శి చల్ల వెంకట నారాయణ అధ్యక్షతన పేద బడుగు బాలహీనవర్గాల ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసి చిరస్థాయిగా నిలిచిన మాజీ పి సి సి అధ్యక్షులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలిఘటించి నివాళులర్పించారు.
ఈకార్యక్రమంలో సారపాక టౌన్ అధ్యక్షులు యాళ్లంకి రాము, భగీ వెంకట్రావు, సీనియర్ నాయకులు పాసిగాంటీ నాగ మురళి, కేసుపాక సావిత్రి, మైపా మణి, లక్ష్మణ్, పుల్లయ్య, నరసయ్య, గిరిజ, రమణ, తదితరులు పాల్గొన్నారు.