ఘనంగా వజ్రోత్సవాల వేడుకలు
మండల పరిధిలోని లక్కవరం గ్రామంలో 75వ స్వాతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా 8వ విడత హరితహారాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లక్కవరం గ్రామంలో గ్రామ సర్పంచ్ కూరపాటి భూపతి ఆధ్వర్యంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్రా పుల్లారెడ్డి సుధారాణి పుల్లారెడ్డి,ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు,ఉప సర్పంచ్ కబీర్,పంచాయతీ కార్యదర్శి సైదా బాబు,ఏపీఓ శ్రీనివాస రావు,టిఏ సుజాత,మాజీ సింగిల్విండో చైర్మన్ బుర్రా నరసింహ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు లచ్చి రెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ జ్యోతి,అంగన్వాడిలు,ఆశా వర్కర్ లు,గ్రామ పెద్దలు బుర్రా రాఘవ రెడ్డి,కర్నాటి రాజమోహన్ రెడ్డి,తీగుళ్ల రామారావు,ఉప్పులూరు వెంకటరెడ్డి,శీలం కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.