ఘనంగా “వాల్మీకి మొగ్గలు” పుస్తకావిష్కరణ

మహబుబ్ నగర్ అర్ సి ,అక్టోబరు 9,(జనంసాక్షి ) :
జిల్లా వాల్మీకి సంఘం, పాలమూరు సాహితి సంయుక్త ఆధ్వర్యంలో యువకవి కోలంట్ల రామకృష్ణ రచించిన “వాల్మీకి మొగ్గలు” పుస్తకాన్ని రాష్ట్ర ప్రొహిబిషన్ , ఎక్సైజ్, పురావస్తు, పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్  ఆవిష్కరించారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని నవాబుపేట రోడ్డులో గల వాల్మీకి రామాలయంలో వాల్మీకి జయంతి సందర్భంగా నిర్వహించిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అందరూ బాగుండాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్క కులానికి స్థలాలనిచ్చి ప్రభుత్వపరంగా ఆదుకుంటున్నామన్నారు. వాల్మీకి కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు.  వాల్మీకులకు ఎకరా స్థలం కేటాయించడం జరిగిందన్నారు. త్వరలోనే వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి మిర్చె అంశం ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. మొగులప్ప‌ , మొగ్గల ప్రక్రియ సృష్టికర్త డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ , పుస్తక సమీక్షకులు  యువకవి బోల యాదయ్య , యువకవి రామకృష్ణ  ,
42 వ వార్డు కౌన్సిలర్ రామ్ లక్ష్మణ్ , మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, ముడా చైర్మన్ గంజి ఎంకన్న, పుస్తక రచయిత కోలంట్ల రామకృష్ణ, పంతులు వెంకటయ్య, పంతులు సత్యన్న, దేవరకద్ర జనార్దన్, మాజీ జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్, జిల్లా వాల్మీకి సంఘం ప్రధాన కార్యదర్శి వి.కృష్ణయ్య, ఎక్సైజ్ సి.ఐ.బాలకృష్ణ, మాజీ హెచ్.ఎం.వెంకటయ్య, యుగంధర్ నాయుడు, పులి జమున, కెపి లక్ష్మీ నరసింహ  ఉప్పరి తిరుమలేష్, వాల్మీకి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫొటొ రైటప్ …
“వాల్మీకి మొగ్గలు” పుస్తకావిష్కరణ చెస్తున్న మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్