ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
జహీరాబాద్ సెప్టెంబర్ 2 (జనం సాక్షి): వైయస్ రాజశేఖర్ రెడ్డి13వ వర్ధంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణంలోని మాజీ మంత్రి గీతారెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసి చిరస్థాయిగా నిలిచిన మన ప్రియతమ తెలుగువారి ఆత్మబంధువు వైయస్సార్ అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను పేదలకు వరంగా అందజేసిన గొప్ప మహనీయుడు పేద ప్రజల ప్రాణాలకు తన ప్రాణం అడ్డువేసి 108 ద్వారా అత్యవసర వైద్య సేవలు అందించారు. ఎంతోమంది నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యాన్ని అందించి పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మీద అభిమానం ఇప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మండల పార్టీ అధ్యక్షులు కాండెం నర్సింలు, పి.నర్సింహారెడ్డి, పి.రామలింగ రెడ్డి,భాస్కర్ రెడ్డి, ఎంపీపీ గుండారెడ్డి, వైస్ ఎంపిపి షాకిర్ అలీ, మాజీ ఎంపిపి సౌకత్ అలీ,యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు నరేశ్ గౌడ్, శుక్లవర్ధన్ రెడ్డి, తహేర బేగం కె.సుజాత, కాజామియా,మొహ్మద్ మొయిజ్, ఇమామ్ పటేల్,నాగిరెడ్డి, నాయిమ్ఉద్దిన్,శుభాస్ రెడ్డి, జెమిలోద్దీన్, నసురుల్లా ఖాన్,శేఖర్,శ్రీనివాసరెడ్డి, ,ఎంపీటీసీ,నర్సింలు,మల్లికార్జున్, నరేందర్, మురిజల్,రాజ్కుమర్,జాహిర్ చిన్న,ఖదీర్ సమేల్,బబ్ల్యూ ,రాము,సంజీవ,విరేశం, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.