ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం.
కౌడిపల్లి (జనంసాక్షి). మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా,వైవిద్య భరితంగా వేద మంత్రోచ్ఛారణలతో రుత్వికులు రాజేశ్వర శర్మ ఆధ్వర్యంలో మూడో రోజున యంత్ర మరియు విగ్రహ ప్రతిష్టాపన, మహాపూర్ణవతి, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి కళ్యాణం, చేపట్టడం జరిగిందని గౌడ సంఘం సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ కృపాకటాక్షాలతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వారు తెలిపారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు చంద్రం దుర్గా గౌడ్, చంద్రం కృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ చంద్రం శ్రీనివాస్ గౌడ్ తో పాటు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సారా రామ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.