ఘనంగా సదా శివ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం

శివ్వంపేట ఆగస్ట్ 21, జనంసాక్షి : మండల కేంద్రమైన శివ్వంపేట లో కొలువైన అతి పురాతమైన సదా శివాలయం వద్ద ఆదివారం వేద పండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజస్తంభం పున: ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, శాస్త్రుల పురుషోత్తంశర్మల ఆధ్వర్యంలో ఈ పూజారి కత్రువులు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవానికి గ్రామస్తులు, శివ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై దేవాలయంలో స్వామి వారి మూలమూర్తిని దర్శించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో  శివంపేట జడ్పిటిసి పబ్బా మహేష్ గుప్తా, సర్పంచి శ్రీనివాస్ గౌడ్, టీఆరెఎస్ సీనియర్ పబ్బా రమేష్ గుప్తా లతోపాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు, భక్తులు తదితరులున్నారు.