ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి.
ఫోటో రైటప్: పాపన్న గౌడ్ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న గౌడ కులస్థులు.
బెల్లంపల్లి, ఆగస్టు18, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈసందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కావాలని పరితపించిన వ్యక్తి పాపన్న గౌడ్ అన్నారు. అగ్రవర్ణాల చేతుల్లో రాజ్యాధికారం ఉండటం వల్ల నిమ్న జాతులకు తీరని అన్యాయం జరుగుతుందని, ఆదిశగా బహుజనుల్ని ఏకం చేసి పోరాటం చేసిన యోధుడన్నారు. ఆ ప్రయత్నంలో గోల్కొండ కోట పై జెండా ఎగరేసిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ పరిధిలోకి అన్ని మండలాల్లోని గౌడ కులస్థులు, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.