ఘనంగా స్నేహితుల దినోత్సవం
నిర్మల్
, ఆగస్టు07,జనంసాక్షి,,,

. స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ కస్బ హైస్కూల్ 1984-1985 బ్యాచ్కు చెందిన పదవ తరగతి విద్యార్థులు ఆదివారం బాలా జీ కన్వెన్షన్ హాల్ లో ప్రత్యేకంగా సమావేశమై స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరినొకరు గుర్తుచేసుకున్నారు. బిజెపి రాష్ట్ర నాయకుడు రావుల రాంనాథ్ గండి రామన్న సాయిబాబా సింగిల్ ట్రస్టీ చైర్మన్ లక్కడి జగన్మోహన్ రెడ్డి మహేందర్ యాదవ్ ఉమాపతి గౌడ్ మడారపు సోమేశ్వర డాక్టర్ శ్రీనివాస్ ఎంఈవో మారెడ్డి శ్రీనివాస్ ఉపాధ్యాయులు వెంకట రమణ రఘునాథ్ సురేష్ జొన్నల మనోహర్ తదితరులు పాల్గొని స్నేహం అన్నిటికంటే గొప్పదని ఎప్పటికీ మరచిపోకుండా ప్రతిసారి కలుస్తూ ఆప్యాయత అనురాగాలు పంచుకోవాలని ఎవరికీ ఇబ్బందులు వచ్చినా వారిని ఆదుకోని సమానంగా ముందుకు వెళ్లాలని సమాజం కోసం పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విందు ఏర్పాటు చేసి అందరూ సహపంక్తి భోజనం చేశారు.
Attachments area