ఘనంగా స్వాతంత్ర వజోత్సవ వేడుకలు.

దౌల్తాబాద్ ఆగష్టు 8, జనం సాక్షి.
దౌల్తాబాద్ మండల కేంద్రంలో భారతదేశ 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణలో భాగంగా అజాది కా అమృత మహోత్సవ పేరుతో దౌల్తాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా ప్రారంభించారు.ఈ వేడుకలు ఈనెల 22వ తేదీ వరకు విద్యార్థులలో వివిధ రకాలైన నైపుణ్యాలను పెంపొందించే విధంగా జాతీయ భావాన్ని పెంపొందించే విధంగా వివిధ కార్యక్రమాలతో అలరించనున్నారు.
ఈ సందర్బంగా కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ ఎం. సంపత్ మాట్లాడుతూ విద్యార్థులు కార్యక్రమాల ద్వారా జాతీయభావంతో మరింత చైతన్యవంతంగా దేశము పట్ల భక్తి భావంతో మెలగాలని అన్నారు.ఈ కార్యక్రమం లో
కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.