చందనాపూర్ గ్రామాన్ని సందర్శించిన జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్

వరద బాధితులకు భరోసా
జనంసాక్షి, రామగిరి :
వారం రోజులుగా భారీగా కురిసిన వానలకు నీట మునిగిన రామగిరి మండలంలోని చందనాపూర్ గ్రామాన్ని శుక్రవారం జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ సందర్శించారు. గోదావరి నదికి సమీపంలో ఉన్న గొల్లవాడ ఇండ్లు నీటిలో మునిగిపోగా స్థానిక సర్పంచ్ దాసరి శంకర్, కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహిమ్, టీఆరెస్ నాయకులు బాధితులకు పభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించారు. శుక్రవారం నీటిమట్టం తగ్గిపోగా జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ వరద తాకిడికి గురైన ఇండ్లను పరిశీలించి బాధితులకు భరోసాను కల్పించారు. అనంతరం శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు, స్థానిక పాలకవర్గానికి సూచన చేసి స్వయంగా ఆయన బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ పనులను ప్రారంభిచారు.