చక్కెర వ్యాధి చిన్నారికి సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం ఆర్థిక సహాయం

గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 8 (జనం సాక్షి);
పుట్టుకతోనే చక్కెర వ్యాధి ఆ బాలుని కబలించింది. ఆ చిన్నారికి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల కు చెందిన సోషల్ రెస్పాన్సిబిలిటీ టీం శనివారం 35 వేల రూపాయలను సీనియర్ న్యాయవాది మధుసూదన్ బాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామానికి చెందిన
రాఘవేంద్ర కు నలుగురు పిల్లలు వారిలో ముగ్గురు పిల్లలను చిన్న వయస్సులోనే సుగర్ వ్యాధితో చనిపోయారు. మిగిలిన 2 సంవత్సరముల బాబు కూడా తీవ్రమైన సుగర్ వ్యాధి తో బాధపడుతూ చికిత్స కోసం అవసరమైన ఆర్థిక స్తోమత లేక సోషల్ రెస్పన్సిబిలిటీ టీమ్ ను సంప్రదించడం తో వారికి ఆర్థిక సాయం చేసినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్యాము,బెంజమిన్, పురుషోత్తం,వెంకట్రాముడు, శేఖర్,చందు,సంజీవ్, మోహన్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.