*చిన్ననాటి మిత్రునికి చేయూత.

చిట్యాల (జనంసాక్షి)మండల కేంద్రానికి చెందిన గుర్రపు శ్రీధర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. కాగా శనివారం తన తోటి చిట్యాల ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న 1998 -99 బ్యాచ్ కి చెందిన మిత్రులు మేము ఉన్నామంటూ తమవంతు ఆర్థిక సహాయార్థం 34500 సహాయం చేసి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తోటి మిత్రులు బాలవేని రాంబాబు తాటిపెల్లి శ్రీనివాస్, సాద.శ్రీనివాస్, కోడెల.అశోక్ జన్నే. యుగేందర్ ,మోత్కూరి రాజు గోల్కొండ మొగిలి తదితర మిత్రులు పాల్గొన్నారు.