చిన్నారి బాలిక కోరిక తీర్చిన నటి శ్రద్దాకపూర్‌

బురఖాతో వెళ్ళి కలసి పరామర్శ

ముంబై,జనవరి30(జ‌నంసాక్షి): బురఖా వేసుకుని ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్ళిన నటి శ్రద్దా కపూర్‌ చిన్నారి ని కలుసుకున్నారు. అభిమానుల కోరికలని తీర్చేందుకు నేటి నటీ నటులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటున్నారని రుజువు చేశారు. కొందరు స్టార్స్‌, కష్టాలలో ఉన్న వారికి ఆర్ధిక సాయాన్ని అందిస్తే మరి కొందరు వారిని స్వయంగా కలిసి కావలసినంత ధైర్యాన్ని ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ భామ, సా¬ బ్యూటీ శ్రద్దా కపూర్‌.. సుమయ్య అనే చిన్నారిని కలిసి ఆమెని సంతోషపరచింది. వివరాలలోకి వెళితే 13 ఏళ్ళ బాలిక సుమయ్య కొంత కాలంగా క్షయ వ్యాధితో బాధపడుతుంది. ఆమె వ్యాధి మూడో దశలో ఉండడంతో కాలేయం కూడా దెబ్బతింది. ఆపరేషన్‌ చేస్తేనే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. సుమయ్య .. కెట్టో అనే ఎన్జీవో ద్వారా వైద్యం పొందుతుండగా, బాలిక మనసులోని కోరికని ప్రముఖ నటి శ్రద్దాకి ట్విట్టర్‌ ద్వారా తెలిపింది ఆ సంస్థ. మిమ్మల్ని సుమయ్య కలవాలనుకుంటుంది అని ఆ సంస్థ వారు ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో తెలపడంతో వెంటనే స్పందించిన శ్రద్దా తన అభిమానిని ఎలా కలవాలో చెప్పండంటూ రీ ట్వీట్‌ చేసింది. అంతేకాదు తన అభిమానిని వ్యక్తిగతంగా కలవాలని భావించిన ఈ అమ్మడు అభిమానులెవరు గుర్తు పట్టకుండా ఉండేందుకు బుర్ఖా ధరించి బాలిక చికిత్స పొందుతున్న ఎన్జీవోకు వెళ్లారు. సుమయ్యతో కలిసి పలు ఫోటోలు దిగిన శ్రద్దా కపూర్‌ సుమయ్యని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడని ప్రార్ధిస్తున్నాను. తనకి నేను ఎలా సాయపడాలో చెప్పండి. విూ సంస్థ(కెట్టో)కి సంబంధించిన వారు చాలా గొప్పగా పని చేస్తున్నారు అని ట్వీట్‌ చేసింది శ్రద్దా. ఈ అమ్మడు ప్రస్తుతం సా¬ చిత్రంతో పాటు సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.