చెక్ డ్యాంల వల్ల రైతులకు ఎంతో మేలు

. జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి
… చెక్ డ్యాం నిర్మాణం పనులు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు
స్టేషన్ ఘన్పూర్, జూలై 20 ,( జనం సాక్షి) :
చెక్ డ్యాంల నిర్మాణంవల్ల నీరు వృథాగాపోకుండా నిల్వ ఉండడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అన్నారు. మండలంలోని తాటికొం డ గ్రామ పంచాయతీ పరిధి లో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమంఅయిన అమృత్ సర్ ప్రాజెక్టులోభాగం గా  వర్షపు నీరును నిల్వ చేయడానికి నూతనంగా నిర్మాణం చేయడం కోసం ఏర్పాటు చేసిన చెక్ డ్యాము పనులను ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపిపి కందుల రేఖ గట్టయ్య , వైస్ ఎంపీపీ చల్లా  సుధీర్ రెడ్డి  ముఖ్యతిథులుగా పాల్గొని బుగ్గగండి వద్ద కొబ్బరి కాయలు కొట్టి చెక్ డ్యాం నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ చెక్ డ్యాంలు నిర్మించుకో వడం వలన నీరు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. రైతులు వాటర్ షెడ్ పథకం సద్వినియోగం చేసుకుని, చెక్ డ్యాంలు నిర్మించుకోవాలని అన్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ మారపాక రాములు, కమిటీ సభ్యులు కుసుమ రమేష్ ,బర్మా మల్లేశం,మారుపాక దేవ దాసు,ఎడమ పెద్దపురం,బొల్లం నాగరాజు  గ్రామ పెద్దలునోములమల్లారెడ్డి,అక్కనపల్లివెంకటయ్య, యూత్ నాయకులుమారపాకసంపత్,బండసంప త్,గండికోట దయాకర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ వీరన్న, టెక్నికల్ అసిస్టెంట్ జాంబ ,పంచాయతీ సెక్రెటరీ జెల్లెల్ల శేఖర్ , నరేష్, సలీం గ్రామ సిబ్బంది తదిత రులు పాల్గొన్నారు.