చెన్నైలో భారీగా నగదు స్వాధీనం
చెన్నై,మార్చి26(జనంసాక్షి): తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై రైల్వే స్టేషన్ సవిూపంలో 1.36 కోట్ల రూపాయల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సీజ్ చేశారు. రూ.1.36 కోట్ల నగదు తీసుకెళుతున్న
ఏపీకి చెందిన నలుగురిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులు ఇన్షర్ట్ చేసుకుని అందులో నగదును దాచారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేక పోవడంతో హవాలా డబ్బుగా అధికారులు అనుమానిస్తున్నారు. పట్టుబడ్డ వ్యక్తులను విజయవాడకు చెందిన బాషా, శ్రీనివాసులు, ఆంజనేయులు, సలీంగా గుర్తించారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సవిూపంలోని వాల్టాక్స్ రోడ్లో ఈ ఘటన జరిగింది.