చెరువు కాట్టకు ఓ రంద్రం పరిశీలించి అధికారులు
బషీరాబాద్ ఆగస్టు 29,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో నవంద్గీ పెద్ద చెరువు కాట్టకు ఓ రంద్రం రెవెన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు చెరువు కాట్టను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చెరువుకు కాట్టకు ఈ రంద్రం అయిన విషయాన్ని రెవెన్యూ అధికారులు ఫోన్లో సంభాషించడం వలన విషయం తెలుసుకొని వెంటనే ఈ చెరువు కట్ట దగ్గరికి వచ్చామని చెరువు రంద్రం నుండి నీరు వెళ్లి కాలువ ద్వారా బయటకు పోతుందని చెప్పారు. బషీరాబాద్ మండలంలోని ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెరువు విషయం లో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇప్పుడే ఇలా జరిగింది.వెంటనే రంధ్రనీ పూడ్చేస్తామని ఈ రంద్రం ద్వారా చెరువు కట్టకు కానీ చెరువు క్రింద ఉన్న పొలాలకు ఎలాంటి నష్టం లేదని రైతులు,ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్,డిప్యూటీ తాహశీల్దార్ వీరేష్ బాబు,గిర్దావరి రాకేష్, సీనియర్ అసిస్టెంట్ వెంకటేష్, ప్రభు,నర్శిములు,రాజన్న పంతులు,తదితరులు పాల్గొన్నారు.