చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కౌన్సిలర్ల ఫోరం జిల్లా అధ్యక్షులు కొత్త కురుమ మంగమ్మ శివకుమార్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నియోజజవర్గ పరిధిలో గల చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులల్లో టి.పి.సి.సి కార్యదర్శి, కొత్తకుర్మ శివకుమార్ జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు, కొత్తకుర్మ మంగమ్మ  ఇంటింటికి తిరిగి  ప్రచారం నిర్వహించారు  ఈ సంధర్బంగా వారు  మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి  పాల్వాయి స్రవంతికి మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు పై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అలాగే పాల్వాయి స్రవంతి  తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి  మునుగోడుకు చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో నాయకులు మడుగుళ్ల జంగయ్య, ఎమ్మెస్ కమేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు గుడ్ల అర్జున్,సైదులు, శివ,బూత్ అధ్యక్షులు రమేష్,శ్రీనివాస్,సత్యం,రాంబాబు,నాగరాజు తదితరులు పాల్గొన్నారు