ఛత్తీస్ఘడ్లో మావోల కుట్ర భగ్నం
ఏడుగురు నక్సల్స్ అరెస్ట్
రాయ్పూర్,సెప్టెంబర్24(జనంసాక్షి): నారాయణపూర్లో మావోయిస్టుల భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో ఏడుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. భారీగా ఆయుధాల డంప్ను స్వాధీనం
చేసుకున్నారు. రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, పోలీసులను టార్గెట్గా చేసుకుని నారాయణపూర్లో మావోయిస్టులు మందుపాతరలను, పైప్ బాంబులను అమర్చారు. గుర్తించిన పోలీసులు వాటిని తొలగించారు. దీంతో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టి, భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు.