జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండోసారి ఆస్తుల అటాచ్‌మెంట్‌

న్యూఢిల్లీ : వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో రెండోసారి ఈడీ ఆస్తులను అటాచ్‌మెంట్‌ చేసినట్లు పీటీఐ కథనాన్ని ప్రచురించింది. రూ. 143 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసినట్లు పేర్కొంది. గతంలో జగతి, జననీ ఇన్‌ఫ్రాక్‌ సంబంధించిన రూ. 51 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.